ఆ రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం !

ఆ రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మరో కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం సృస్టించనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ కు 65 కి.మీ, తెలంగాణలోని భద్రాచలానికి 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండి వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో తుఫాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుందని తెల్పింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.