స్వప్నలోక్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

స్వప్నలోక్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

స్వప్నలోక్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియావరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు.

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం సూచించారు.