పంజాబ్ లో మోడీ ఎందుకు వెనుతిరిగాడు ?

పంజాబ్ లో మోడీ ఎందుకు వెనుతిరిగాడు ?

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యంపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని ర్యాలీని అడ్డుకున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ధ్వజమెత్తారు. పోలీసులు నిరసనకారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ నిరాకరించారని జేపీ నడ్డా నిప్పులు చెరిగారు.పంజాబ్ లో మోడీ ఎందుకు వెనుతిరిగాడు ?

ఇక ప్రధాని మోడీ కాన్వాయ్ అడ్డగింత ఘటనపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని, 10వేల మంది పోలీసులతో పటిష్ఠ సెక్యురిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. హెలికాప్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోడీ ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు మార్గంలో రావడం సమస్యకు కారణమైందని వెల్లడించారు. రోడ్డును క్లియర్ చేయాలని నిరసనకారులను తాను స్వయంగా అభ్యర్థించినట్లు సీఎం చన్నీ తెలిపారు.