టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా..

టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా..

టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా..

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత టెన్నిస్ కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు ఆఖరివని తెలిపింది. ఈ మేరకు మూడు పేజీల నోట్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఇందులో సానియా టెన్నిస్ లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.

6 యేళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందని సానియా పేర్కొంది. 30 యేళ్ల క్రిందట హైదరాబాద్ లో తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్ లో టెన్నిస్ కోర్టుకు వెళ్లానని తెల్పింది. అక్కడ కోచ్ టెన్నిస్ ఎలా ఆడాలో వివరించినట్లు గుర్తు చేసుకుంది. అన్ని సమయాల్లో తల్లిదండ్రులతో పాటు కుటుంబం, కోచ్, ఫిజియో, మొత్తం టీం సపోర్ట్ లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని తెల్పింది. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానని తెల్పింది. అందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని చెప్పింది. హైదరాబాద్ కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెల్పింది.

సానియా తన కెరీర్ లో 36 యేళ్ల వయసులో ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఉమెన్స్ డబుల్స్ లో కజకిస్తాన్ కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్ స్లామ్ లో ఆడనుంది. మోచేయి గాయం కారణంగా గత యేడాది యూఎస్ ఓపెన్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఫిట్ నెస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో గత యేడాదే రిటైర్మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదలగడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

సానియా కెరీర్ లో 6 గ్రాండ్ స్లామ్ లను సాధించింది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది. అంతకు ముందు సింగిల్స్ లోనూ సత్తా చాటింది సానియా. వరల్డ్ ర్యాంకింగ్స్ లో 27వ స్థానానికి చేరింది. 2005లో యూఎస్ ఓపెన్స్ లో 4వ రౌండ్ కు చేరింది.