మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీకి కరోనా

మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీకి కరోనా

హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిన్న మొన్న మంత్రితోనే ఆయన తిరిగారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఒక మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. అంతే కాకుండా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సహాయకుడికి కరోనా సోకింది. ఇప్పుడు తాజాగా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీకే కరోనా పాజిటివ్ అని తేలింది.