మేఘా రక్షణ రంగ ప్రవేశం

దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే ఆయుధాలతో కూడిన వాహనాల ఉత్పత్తికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) శ్రీకారం చుట్టనుంది . ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. త్వరలో హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పరిశ్రమను స్థాపించనుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మేకిన్ ఇండియా విధానంలో భాగంగా రక్షణ పరికరాల సేకరణ విధానం-2020 కి అనుగుణంగా ఈ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడిపరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తికి అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకుంది. సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన కేంద్రం సైన్యానికి ఆయుధాలతో సహా వాహనాలను ఉత్పత్తి అందచేసేలా అనుమతులను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పారిశ్రామిక శాఖల నుంచి అనుమతులు అందుకుంది. ఈ మేరకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ మంత్రిత్వ శాఖలు అనుమతులు మంజూరు చేశాయి.మేఘా రక్షణ రంగ ప్రవేశం మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో పేరెన్నికగన్న మేఘా ఇంజనీరింగ్ నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో అడుగుపెట్టి ఆ తరువాత చమురు-ఇంధన వాయువు, విద్యుత్, సౌరవిద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన విషయం తెలిసిందే. మేఘా ఇంజనీరింగ్ 20 దేశాల్లో వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. దేశ రక్షణ వ్యవస్థలోని వివిధ విభాగాలకు ఇప్పటికే శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్నమేఘా యుద్ధ సామాగ్రి ఉత్పత్తికి సంబంధించి దాదాపు 500 కోట్ల పెట్టుబడులు దశల వారీగా పెట్టనుంది.

మేఘా జీడిమెట్లలో ఏర్పాటు చేసే రక్షణ రంగ పరికరాల తయారీ యూనిట్లో యుద్ధట్యాంకులు, వాటి విడి పరికరాలు, తేలికపాటి యుద్ధవాహనాలు, ఆర్మ్డ్ ఇంజనీరింగ్, రికవరీ వాహనాలు, సైనికులను చేరవేసే వాహనాలు (ఏపిసి), ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వాహనాలు, , బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగగలిగే యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది. యుద్ధ వ్యూహ తంత్రానికి సంబంధించిన వాహనాలు (టిఎంఏవి), మందు పాతరలను తట్టుకోగలిగే వాహనాలను కూడా ఉత్పత్తి చేయనుంది . మిసైల్స్ , మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగుల (క్యానన్) ఉత్పత్తికి మేఘా అనుమతిపొందింది. భూ, సముద్ర, ఆకాశ మార్గాల నుంచి ఉపయోగించేలా మిసైల్స్ను మేఘా ఉత్పత్తి చేయనుంది. యుద్ధ సమయంలో ఉపయోగించే కీలకమైన హొవిట్జర్స్, యాంటి ట్యాంక్ వెపన్స్, రైఫిల్స్ తదితర సామాగ్రి ఉత్పత్తి చేయనుంది. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రోటో టైప్ పద్ధతిలో స్వయం సమృద్ధితో దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎంఈఐఎల్ వీటిని ఉత్పత్తి చేస్తుంది.మేఘా రక్షణ రంగ ప్రవేశం

ఇదీ మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థే

దేశంలోనే తొలిసారి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను తయారు చేసిన ఐకామ్ టెలీ సంస్థ కూడా మేఘా గ్రూప్ సంస్థ కావటం విశేషం. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, కోవిడ్ 19 నమూనాలను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ల్యాబ్ కోవిడ్ -19 స్క్రీనింగ్, సంబంధిత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయనుంది. ఈ ల్యాబ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బయో-సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఐకామ్ సంస్థ నిర్మించింది. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీతో పాటు, టెలి విద్యుత్ ప్రసారం, పంపిణీ, సౌర, చమురు, గ్యాస్ రంగాలో పని చేస్తోంది. బ్రహ్మోస్, ఆకాష్, పిజిఎడి, ఎంఆర్ఎస్ఎమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వంటి క్షిపణి కార్యక్రమాలకు అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్ యాంప్లిఫైయర్లు, కంటైనర్లను ఐకామ్ సరఫరా చేస్తుంది. భారత వైమానిక దళానికి ‘విండ్ ప్రొఫైల్ రాడార్’ను అభివృద్ధి చేసింది కూడా ఐకామ్ కావటం విశేషం.

మేఘా సాధించిన విజయాలలో ఇవి కొన్ని ……మేఘా రక్షణ రంగ ప్రవేశం

బహుళ రంగాల్లో విస్తరించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ తన ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించింది . ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది . ఎన్పీకుంట విద్యుత్ సబ్ స్టేషన్, పట్టిసీమ ప్రాజెక్ట్లను ఏడాదిలోనే పూర్తిచేసినందుకు గాను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించింది. ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలోని అనేక ప్రాజెక్టు ల్లో తొలుత ప్రవేశపెట్టింది ఎం ఈ ఐ ఎల్ . ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు , పట్టిసీమ, నంబులపూలకుంట (ఎన్పీకుంట) విద్యుత్ సబ్ స్టేషన్ ను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత ’మేఘా‘ది. ఆంధ్రప్రదేశ్ లో అరుదైన హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నిర్మించింది మేఘానే . అత్యంత సుదూర, ఎత్తైన ప్రాంతాలకు నీటిని ఈ పథకం ద్వారా పంపింగ్‌ చేస్తోంది మేఘా . ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లోని 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, గుజరాత్ లో 10 మెగావాట్ల అరుదైన కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టులను నిర్మించి రికార్డ్ నెలకొల్పింది ఎంఈఐఎల్. దేశంలో ఐదు నదులను మొదటి సారిగా అనుసంధానం చేసిందికూడా మేఘానే. హైదరాబాద్ నగర తాగునీటి కష్టాలను తొలగించేందుకు ఆసియాలోనే అతిపెద్ద తాగునీటి పథకాన్ని ఎంఇఐఎల్ నిర్మించింది. . దేశంలో ని 29 రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పాధక సామర్థ్యంతో పోలిస్తే 5వ స్థానంలో నిలిచే అత్యంత పెద్దదైన వెస్ట్రన్‌ యూపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (WUPPTCL) విద్యుత్‌ సరఫరా (పవర్‌ ట్రాన్స్‌మిషన్‌) వ్యవస్థను నిర్మించింది ఎం ఈ ఐ ఎల్.