6వ రోజు రైతుబంధు రూ.262.60 కోట్లు జమ

6వ రోజు రైతుబంధు రూ.262.60 కోట్లు జమ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 10వ విడత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 6వ రోజు 1 లక్షా 49,970 మంది రైతుల ఖాతాల్లో రూ.262.60 కోట్ల నిధులు జమ అయ్యాయి. 5 లక్షల 25వేల 200.21 ఎకరాలకు నిధులు విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 51 లక్షల 50 వేల 958 మంది రైతులకు రూ. 3767.35 కోట్లు జమ అయ్యాయి.6వ రోజు రైతుబంధు రూ.262.60 కోట్లు జమఈ సందర్భంగా దేశమంతా తెలంగాణ పథకాలు అమలుకావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆలోచనలు దేశానికి అత్యవసరం అని చెప్పారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలని 8 యేళ్లలో కేసీఆర్ వినూత్న పథకాలతో పటిష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. రైతాంగానికి సాగునీరు, ఉచిత విద్యుత్ పై పాలకుల వైఖరి మారాలన్నారు. ఉచితం అంటే అనుచితంగా మాట్లాడుతున్నారని కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయకున్నా కరెంటు, సాగునీరు, రైతుభీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేశమంతా ఈ పథకాలు అమలైతే దేశ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.