ఈడీ ఎదుట నటి ఐశ్వర్యారాయ్

ఈడీ ఎదుట నటి ఐశ్వర్యారాయ్న్యూఢిల్లీ : పనామా పేపర్స్ కేసులో నటి ఐశ్వర్యరాయ్ సోమవారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ లో హాజరయ్యారు. అధికారులు ఆమెను 6 గంటల పాటు ప్రశ్నించారు. ఐశ్వర్య కొన్ని కీలక పత్రాలను అధికారులకు సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెల్పాయి.

‘పనామా పేపర్స్’ కేసుకు సంబంధించి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల ఐశ్వర్యకు సమన్లు జారీ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె సోమవారం హాజరైనట్లు పేర్కొన్నాయి.

పన్ను ఎగవేత, మనీలాండరింగ్, విదేశీ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులకు పాల్పడిన ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించి 2016లో ‘పనామా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఒక నివేదికను వెల్లడించింది. భారత్ కు చెందిన 426 మంది ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.