కందికొండ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి

కందికొండ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ’ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతికి మంత్రి సంతాపం తెలిపారు. కందికొండ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతితెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.