పశ్చిమలో భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు

పశ్చిమలో భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలుపశ్చిమలో భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ మర్రి యాదవ రెడ్డి సభాధ్యక్షతన బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి అనుచరులు సుమారు 600 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరిని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు డివిజన్ ఇన్చార్జిల సమక్షంలో సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, ఆనాడు 2001లో తెలంగాణ స్వరాష్ట సాధనే ధ్యేయంగా ప్రారంభించినటువంటి పార్టీ అని అన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ ధ్యేయంగా మునుముందుకు సాగుతుందన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాకేష్ రెడ్డి అనుచరులు సుమారు 600 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.అందరినీ సమన్వయం చేసి, అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఇప్పుడు చేరినటువంటి నాయకులకు సైతం సమన్యాయం చేయాలని, వారందరిని కలుపుకుపోవాలని దాస్యం అన్నారు. రాకేష్ రెడ్డి తో పాటు అనేక దైవిక కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనడం జరిగిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో గల కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండి, ఐక్యతతో పనిచేసి భారీ మెజారిటీ సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ 20 రోజులు ప్రతి ఒక్కరు సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.పశ్చిమలో భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలుపశ్చిమ నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ వినూత్న రీతిలో ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా పనిచేస్తున్నానన్నారు. ఇటీవల కేటీఆర్ ఇక్కడి సమావేశానికి వచ్చినప్పుడు గతంలో ఎంత మెజారిటీ వచ్చింది అంటే 37,000 అని చెప్పానని, ఇప్పుడు 50,000 దాటాలని ఆయన చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే ఆ మెజారిటీ కంటే ఎక్కువనే వస్తుందని దాస్యం ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ లో ఇటీవల చేరిన రాకేష్ రెడ్డి మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని,వారి సారథ్యంలో భారత రాష్ట్ర సమితిలో ఎంతో మందిని యువ ప్రజా ప్రతినిధులు తయారు చేస్తున్నారని అన్నారు.ఇక్కడికి వచ్చినటువంటి యువత ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా పనిచేస్తారని,మల్టీ టాలెంటెడ్ గా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ తూర్పు పశ్చిమ ఎన్నికల సమన్వయకర్త ఈగ మల్లేశం, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ జనార్ధన్ గౌడ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, గుంటి రజిత శ్రీనివాస్, ఇమ్మడి లోహిత రాజు, అభినవ్ భాస్కర్, బొంగు అశోక్ యాదవ్, మానస రాంప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుతల సారంగపాణి, నార్ల గిరి రమేష్, నయీముద్దీన్, పులి రజనీకాంత్, శివశంకర్, నలబోల సతీష్, సంపత్ రెడ్డి, కంజర్ల మనోజ్, నజీర్, ఖలీల్, జన్ను జకార్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.