కందికొండ మృతి పట్ల సంతాపం తెల్పిన దాస్యం

కందికొండ మృతి పట్ల సంతాపం తెల్పిన దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న కందికొండ యాదగిరి మరణం పట్ల సంతాపం తెల్పారు. కందికొండ మృతి పట్ల సంతాపం తెల్పిన దాస్యంతెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపిన ఓరుగల్లు బిడ్డ కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించారని స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.