మానిక్కం ఠాకూర్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

మానిక్కం ఠాకూర్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: నాటి ఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ, ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడం వల్ల తెలంగాణ ఇచ్చారే తప్ప, అది ఎవరి భిక్ష కాదని ఆమె మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మానిక్కం ఠాకూర్ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చింది. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం సీఎం హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని ఆమె చాటిచెప్పారు. ప్రజా పోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోండని ఆమె హెచ్చరించింది.