రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

వరంగల్ టైమ్స్, భద్రాచలం : భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ప్రభుత్వం తరపున శ్రీరామచంద్రునికి, సీతమ్మకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులుసీతారాముల కల్యాణం తిలకించేందుకు రెండేండ్ల తర్వాత భక్తులకు అనుమతించారు. దీంతో భద్రాచలం ఆలయ వీధులు భక్త జనసందోహంగా మారాయి. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నది.రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు