సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు

warangaltimes, హైదరాబాద్ : సికింద్రాబాద్ సహా భారత దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ శాఖ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్లలో ఎన్నికలు రద్దు అయ్యాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఈ యేడాది ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది.