సానియా షాకింగ్ ప్రకటన..కారణమేంటి..!

సానియా షాకింగ్ ప్రకటన..కారణమేంటి..!

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. ఈ యేడాది సీజన్ తో తన కెరీర్ ముగుస్తున్నట్లు ప్రకటించింది. 35 యేండ్ల సానియా మహిళల డబుల్స్ టెన్నిస్ విభాగంలో ఎన్నో అద్భుతాలు చేసింది. భారత్ కు ఎన్నో విజయాలు అందించింది. తొలి గ్రాండ్ స్లామ్ అందుకున్న భారతీయురాలిగా సానియా చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో సానియా, నదియా కిచెనాక్ జోడీ, తొలి రౌండ్ లోనే ఓటమి చవిచూసింది.సానియా షాకింగ్ ప్రకటన..కారణమేంటి..!ఈక్రమంలోనే స్పందించిన సానియా ” కొన్ని కారణాలున్నాయి. జస్ట్ నేనిక ఆడను అని సడెన్ గా నిర్ణయం తీసుకోలేదు. గత యేడాది చివర లేదంటే ఈ యేడాది ఆరంభంలోనే నాకు తెలుసు. ఇక ఇదే నా చివరి సీజన్ అని ఎందుకంటే నా శరీరం మునపటిలా లేదు. ఇప్పటి మ్యాచ్ లో కూడా నా మోకాలు నొప్పి పెడుతూనే ఉంది. అందుకనే ఓడిపోయామని నేనడం లేదు.

జస్ట్ వయసు పెరిగేకొద్దీ కోలుకోవడానికి సమయం పడుతోంది. నేను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటానని ఎప్పటి నుంచో చెప్తున్నా. కానీ ఇప్పుడు గతంలో ఉన్నంత ఉత్సాహం రావడం లేదు, దానికి తోడు నా రెండేళ్ల కుమారుడిని వెంట పెట్టుకుని ప్రయాణాలు చేయడం పిల్లాడికి కూడా మంచిది కాదు. దాన్ని కూడా నేను పరిగణనలోకి తీసుకోవాలి” అని సానియా వెల్లడించింది.

ప్రస్తుతం సానియా 68వ ర్యాంకులో ఉంది. తన కెరీర్ లో అత్యుత్తమంగా డబుల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచింది. సింగిల్స్ లో అత్యుత్తమంగా 27వ ర్యాంకులో నిలిచింది. చివరగా 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మార్టినా హింగిస్ తో కలిసి టైటిల్ గెలిచింది. వీళ్లిద్దరూ మహిళల టెన్నిస్ లో అత్యుత్తమ జోడీల్లో ఒకరిగా వెలుగొందిన విషయం విదితమే.