రూ.2 వేల నోట్లు త్వరలోనే రద్దు..! బీజేపీ ఎంపీ

రూ.2 వేల నోట్లు త్వరలోనే రద్దు..! బీజేపీ ఎంపీ

రూ.2 వేల నోట్లు త్వరలోనే రద్దు..! బీజేపీ ఎంపీ

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్‌బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు.