ఆ రంగానికి కేంద్రం నిధులివ్వాలి : కేటీఆర్ 

ఆ రంగానికి కేంద్రం నిధులివ్వాలి : కేటీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి ఊతమివ్వాలని రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు. నేతన్నల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.ఆ రంగానికి కేంద్రం నిధులివ్వాలి : కేటీఆర్ కేంద్ర బడ్జెట్ లో కొన్నేళ్లుగా తెలంగాణకు అందుతున్నది శూన్యమని, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు, సిరిసిల్ల మెగా పవర్ లూం క్లస్టర్ కు నిధులు ఇవ్వాలన్నారు. టెక్స్ టైల్, చేనేతరంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. బ్లాక్ లెవల్ హ్యాండ్ లూం క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు. టెక్స్ టైల్, నేతన్నల పరిస్థితిపై కేంద్రానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. నేతన్నల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు.