తెలంగాణ ఎస్పీఎఫ్ లో మహిళలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ఎస్పీఎఫ్ లో మహిళలకు గ్రీన్ సిగ్నల్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మొదటిసారి మహిళలకు అవకాశం దొరికింది. తెలంగాణ ఎస్పీఎఫ్ లో మహిళల ప్రవేశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో 12 వందల పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం లాంటిచోట్ల విధి నిర్వహణ కోసం 70 మంది మహిళా కానిస్టేబుల్స్, 12 మంది మహిళా ఎస్సై పోస్టులను కేటాయించింది. హైకోర్టుతోపాటు వివిధ జిల్లా కోర్టుల్లో 730 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం తెల్పింది. పవర్ జనరేషన్ కార్పొరేషన్లో 277 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ చేశారు.తెలంగాణ ఎస్పీఎఫ్ లో మహిళలకు గ్రీన్ సిగ్నల్బేగంపేట విమానాశ్రయం భద్రత కోసం 114 మంది కానిస్టేబుళ్ల నియమించనున్నారు. దీనికోసం ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కేబినెట్ ర్యాటిఫికేషన్ లో నిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం. ఎస్పీఎఫ్ లో ఒక డీఐజితో పాటు మరో అడిషనల్ కమాండెంట్ పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెల్పింది. వివిధ కోర్టుల్లో 4600 కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. మెదక్ జిల్లా కుకునూర్ పల్లిలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు 25 పోస్టులు మంజూరు చేసింది.