బైడెన్‌ హత్యకు తెలుగు యువకుడి కుట్ర

బైడెన్‌ హత్యకు తెలుగు యువకుడి కుట్ర

జోబైడన్‌ హత్యకు ప్లాన్ చేసిన సాయివర్షిత్‌
ఓ ట్రక్‌ను అద్దెకు తీసుకున్న నిందితుడు
ట్రక్‌తో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్ళిన సాయి
బైడెన్‌ హత్యకు సాయి కుట్ర చేసినట్లు నిర్ధారణ
6 నెలలుగా ప్లాన్‌ చేసినట్లు ఒప్పుకున్న సాయి
నాజీ జెండాతో హిట్లర్ పై సాయి పొగడ్తలు
ఈ కుట్రపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

బైడెన్‌ హత్యకు తెలుగు యువకుడి కుట్రవరంగల్ టైమ్స్,అమెరికా: అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్యకు తెలుగు యువకుడు సాయివర్షిత్ కుట్ర పన్నినట్లు అమెరికా పోలీసులు తెలిపారు.గత 6 నెలలుగా దాడికి ప్లాన్ చేశానంటూ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. మే 22న వైట్ హౌస్ పరిసరాల్లోకి సాయి వర్షిత్ ట్రక్ తో దూసుకెళ్లి ట్రాఫిక్ బారియర్స్ ను ఢీకొట్టాడు. దీంతో రాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో ట్రక్ పై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో సాయి వర్షిత్ ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో అమెరికా అధ్యక్షుడపై దాడి చేసేందుకు 6 నెలలుగా ప్లాన్ చేశానని సాయి వర్షిత్ ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై ర్యాస్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నినట్లుగా కేసులు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే సాయివర్షిత్ కందుల అమెరికాలోని మిస్సోరి స్టేట్ చెస్ట్ ఫీల్ట్ లో ఉంటున్నాడు. 2022లో మార్క్టెట్ సీనియర్ హైస్కూల్ నుంచి అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.ఇటీవల మిస్సోరి నుంచి వాషింగ్టన్ డీసీకి ఫ్లైట్ లో వచ్చిన సాయి వర్షిత్ వచ్చీరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్ హౌస్ లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో మొదటి బారికేడ్ వద్దనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ విషయాన్ని అధికారులు మంగళవారం ఉదయం బైడెన్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సాయి వర్షిత్ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.