ఆ దేశంలో అదుపులో ఉన్న కొవిడ్

ఆ దేశంలో అదుపులో ఉన్న కొవిడ్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,342 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు 5,30,722 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.15 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.