శ్రీవారికి కానుకగా మొక్కను నాటి ఎంపీ

శ్రీవారి కి హరిత కానుక మొక్కను నాటి మొక్కు తీర్చుకన్న ఎంపీ సంతోష్​కుమార్​శ్రీవారికి కానుకగా మొక్కను నాటి ఎంపీతిరుపతి : దైవాంశ సంభూతమైన ప్రకృతి కోసం ఆ దేవ దేవుని సన్నిధిలోనూ పరితపిస్తున్నడు..అంతా శ్రీహరి మయం, ఈ జగమంతా హరితమయం.. అని ధ్యాన్నిస్తున్నడు. వెంకటేశ్వరుని సాన్నిధ్యంలో మొక్కకు జీవం పోసి ఈ విశ్వానికి దైవ చింతనతో పాటు ప్రకృతి చింతనను ప్రభోదిస్తున్నడు..హరిత రుషి..ఎంపీ సంతోష్ కుమార్. లోకాలనేలే శ్రీహరి దర్శనానంతరం హరితాన్నే ఆ స్వామి వారికి కానుకగా సమర్పించుకున్నడు. పచ్చని మొక్కను నాటి తన మొక్కును తీర్చుకున్నడు.. తన మిత్రులతో కలిసి కాలినడకన తిరుమల తిరుపతికి చేరుకొని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ నవీన్ రావు, పోచంపెల్లి శ్రీనివాస రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్నమనేని శ్రీనివాస రావు లు ఉన్నారు.