యాదాద్రీశుడి సన్నిధిలో ఎమ్మెల్యే చల్లా ఫ్యామిలి

యాదాద్రీశుడి సన్నిధిలో ఎమ్మెల్యే చల్లా ఫ్యామిలి

వరంగల్ టైమ్స్, యాదాద్రి జిల్లా : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ఎమ్మెల్యే చల్లా కుటుంబసభ్యులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి చల్లా ధర్మారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, పండ్లు, పూలు సమర్పించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన చొరవతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.యాదాద్రీశుడి సన్నిధిలో ఎమ్మెల్యే చల్లా ఫ్యామిలిఇందులో భాగంగానే నూతనంగా నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో తొలిసారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వడం, ఈ దర్శన భాగ్యం తమకు కల్గడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చల్లా ధర్మారెడ్డి అన్నారు. అనంతరం దేవాలయంలో స్వామి వారి తిరువీధుల ఊరేగింపులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.