టెక్సాస్ జడ్జిగా భారత సంతతిరాలు

టెక్సాస్ జడ్జిగా భారత సంతతిరాలు

టెక్సాస్ జడ్జిగా భారత సంతతిరాలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నేత జూలి మాథ్యూ, టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. కేరళలోని తిరుమల్ల ఆమె స్వరాష్ట్రం. కాసరగడలోని బీమనాడే నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ప్రమాణం చేశారు.

4 యేళ్ల పాటు ఆమె కౌంటీ జడ్జిగా చేస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఆండ్రూపై మాథ్యూ 123,116 ఓట్ల తేడాతో గెలుపొందారు. జూలి ఏ మాథ్యూ 15 యేళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నారు. టార్చర్, సివిల్ లిటిగేషన్, క్రిమినల్ మేటర్స్ లాంటి అంశాల్లో ఆమె కేసులు వాదిస్తుంటారు. జువెనైల్ ఇంటర్వెన్షన్, మెంటల్ హెల్త్ కోర్టుకు అధిపతిగా ఆమె కొనసాగుతున్నారు. మాథ్యూ ఫిలడెల్ఫియాలో పెరిగింది. పెన్ స్టేట్ యూనివర్సిటీకి ఆమె హాజరైంది. దెలావర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు.