ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీం కోర్టు జడ్జిలు 

ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీం కోర్టు జడ్జిలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురు జడ్జీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాకు సుప్రీం జడ్జీలుగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే.

ఈ ఐదుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత యేడాది డిసెంబర్ 13న సిఫారసు చేయగా, కేంద్రం దాదాపు రెండు నెలలకు ఆమెదం తెల్పింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 5 ఐదుగురు సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32 కి చేరింది.