కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెల్పింది. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నామని తెల్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నప్పటికీ, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడు తక్కువ చేయలేదన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకురాబోతున్నామని హరీష్ రావు ప్రకటించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని హరీష్ రావు ప్రకటించారు.