170 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి..!

170 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి..!

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : భారత్ లో గడిచిన 24 గంటల్లో 85,282 మందిని పరీక్షించగా, 170 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,094కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,371 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే కొవిడ్ బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,721కి చేరింది.

నమోదైన మొత్తం పాజిటివ్ కొవిడ్ కేసుల్లో ఇప్పటివరకు 0.01 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.14 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.