యాదాద్రిలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన

యాదాద్రిలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన

వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. బాలాలయంలో శాంతి పాఠం, చతు:స్థానార్చన, మూలమంత్ర హవనం చేశారు. ప్రధానాలయంలో పంచవింశతి కలశ స్నపనం, నిత్యలఘు పూర్ణాహుతి చేయనున్నారు. యాదాద్రిలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటనసాయంత్రం 6 గంటలకు బాలాలయంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో ద్వార తోరణ ధ్వజ కుంభ ఆరాధనలు, మూల మంత్ర హవనం నిర్వహిస్తారు. ప్రధానాలయంలో చతు:స్థానార్చనగావించి ప్రతిష్ఠామూర్తులకు జలాధి వాసం చేపట్టి నిత్య లఘు పూర్ణాహుతితో ముగిస్తారు.