జనవరి 17న 36 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

జనవరి 17న 36 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దుహైదరాబాద్ : నగరంలో పలు స్టేషన్ల మధ్య నడుస్తున్న పలు రూట్లలో నడుస్తున్న 36 సర్వీసులను సోమవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం 79 సర్వీసులకు 36 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండటంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది.

లింగంపల్లి – హైదరాబాద్ మీదుగా నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు, ఫలక్ నుమా – లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. అలాగే లింగంపల్లి – ఫలక్ నుమా మీదుగా నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి- సికింద్రాబాద్ మీదుగా నడిచే రెండు సర్వీసులను రద్దు చేసినట్లు వివరించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.