ఈఎస్ఐసీలో 4315 యూడీసీ, ఎంటీఎస్ పోస్టులు

ఈఎస్ఐసీలో 4315 యూడీసీ, ఎంటీఎస్ పోస్టులున్యూఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఈఎస్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల్గిన వారు ఫిబ్రవరి 15 నాటికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 4315 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో అప్పర్ డివిజన్ క్లర్క్ ( యూడీసీ ), స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులున్నాయి.

తెలంగాణ ( 72 ), ఆంధ్రప్రదేశ్ ( 35 ) తో పాటు కోల్ కతా, డెహ్రాడూన్, కాన్పూర్, ఢిల్లీ, జైపూర్, ఛత్తీస్ గఢ్ , పుదుచ్చేరి, ఫరీదాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టులు : 4315 , ఇందులో యూడీసీ 1726, స్టెనో 163, ఎంటీఎస్ 1931 చొప్పున ఖాళీలున్నాయి. హైదరాబాద్ లో యూడీసీ 25, స్టెనో 4, ఎంటీఎస్ 43, విజయవాడలో యూడీసీ 7, స్టెనో 2, ఎంటీఎస్ 26 ఖాళీలున్నాయి
అర్హతలు : డిగ్రీ, ఇంటర్, టెన్త్ , కంప్యూటర్ పరిజ్ఞానం కల్గి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 యేండ్ల వయసు కల్గి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష , కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ. 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 15
వెబ్ సైట్ : www.esic.nic.in