బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడను: కేసీఆర్ 

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడను: కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇన్ కం ట్యాక్స్, ఈడీ దాడులు చేస్తారని గత రెండు, మూడు రోజుల నుంచి యూట్యూబ్ లో ప్రచారం చేస్తున్నారు. ఈడీ కాకపోతే బోడీ దాడులు చేయమను, ఎవరు వద్దంటున్నారు.బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడను: కేసీఆర్ ఎవడు భయపడుతారు. కేసీఆర్ ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడుతాడా? ఈడీలకు, బోడీలకు, ఇన్ కం ట్యాక్స్ లకు భయపడితే 15 యేండ్లు తెలంగాణ ఉద్యమం చేద్దుమా ? మేమా భయపడేది. ఈడీ దాడులని, సీబీఐ దాడులని బెదిరిస్తే కేసీఆర్ భయపడుతాడా? ఇలాంటి పనులు అన్ని చోట్ల వర్కౌట్ కావు. భయంకరంగా స్కామ్ లు చేసేవాళ్లు భయపడుతారు. మేం భయపడే ప్రసక్తే లేదు. పిట్ట బెదిరింపులకు, ఈడీ, బోడీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. చినజీయర్ స్వామితో తనకు ఎలాంటి విభేధాలు లేవని మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.