చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల

చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిలహైదరాబాద్‌ : సైదాబాద్‌ చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల పరామర్శించారు. బాధతురాలి ఇంటి వద్ద వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్‌ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.