సింగరేణి సంస్థ మూసివేతకు బీజేపీ కుట్ర: కవిత

సింగరేణి సంస్థ మూసివేతకు బీజేపీ కుట్ర: కవితవరంగల్ టైమ్స్ , హైదరాబాద్‌ : బీజేపీ ప్రభుత్వం పై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సింగరేణిలో రాష్ట్రానికి 51%,కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని ఆరోపించారు. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్దమని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో, దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించిందన్న విషయాన్ని కేంద్రానికి ఆమె గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ,కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందన్న ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తెలిపారు.