జపాన్ లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

జపాన్ లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

వరంగల్ టైమ్స్, టోక్యో : జపాన్ లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెల్పింది. ఫుకుషిమా తీరంలోని 60 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.36 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. 297 కిలో మీటర్ల దూరంలోని రాజధాని టోక్యో వరకు భూకంపం ప్రభావం కనిపించినట్లు వెల్లడించింది. కాగా, ఈశాన్య తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు ఒక మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడవచ్చని జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది.జపాన్ లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలుఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు జపాన్ లో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ పేర్కొంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు. మరోవైపు 2011లో కూడా ఉత్తర జపాన్ లో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈనేపథ్యంలో ఉద్భవించిన సునామీ అణు విపత్తుకు కారణమైంది.