ఆసియా కప్ హాకీ ట్రోర్నీలో..భారత్ కు కాంస్యం

ఆసియా కప్ హాకీ ట్రోర్నీలో..భారత్ కు కాంస్యంఢాకా : ఆసియా కప్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీ ఫైనల్ లో జపాన్ చేతిలో ఓటమిపాలైన భారత్ మూడోస్థానం కోసం పాక్ తో పోటీపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు 4 -3 గోల్స్ తేడాతో పాక్ పై విజయం సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో మరో సెమీ ఫైనల్ లో సౌత్ కొరియా చేతిలో 5-6 తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. సెమీస్ లో ఓడిన రెండు జట్టు మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. ఢాకా వేదికగా జరిగిన ఈ పోటీలో భారత్ పైచేయి సాధించి, టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించింది.