మాజీ గవర్నర్ నరసింహన్ కు సీఎం కేసీఆర్ పరామర్శ


చెన్నై : తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ ను పరామర్శించారు. మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నరసింహన్ కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు నరసింహన్ ను కావేరీ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ గవర్నర్ ఇంకా మూడు, నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండనున్నారు.