షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ అను

షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ అను

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం అను. ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. హొలీ సందర్భంగా ఈ చిత్రంలోని లిరికర్ సాంగ్ ఏమైంది ఏమో సాంగ్ ను విడుదల చేశారు. సాంగ్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ మూవీలో మిగిలిన సాంగ్స్ త్వరలో విడుదల కానున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ అనుహర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ తెలిపారు. కథ, కథనాలు బాగున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అను సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉందని హీరో ప్రశాంత్ కార్తిక్ తెలిపారు. దర్శకుడు భీమినేని శ్రీనివాస్, మరియు దేవి ప్రసాద్ ఈ చిత్రంలో మంచి పాత్రల్లో నటించారు. సినిమా ఔట్ ఫుట్ బాగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.

బ్యానర్: తేజస్వి క్రియేటివ్ వర్క్స్

నటీనటులు: ప్రశాంత్ కార్తిక్, మిష్టి చక్రవర్తి, కార్తిక్ రాజు, ఆమని, భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ తదితరులు

సంగీతం: గంటసాల విశ్వనాధ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ గోపిశెట్టి