ముందస్తు ఎన్నికలకు వెళ్లము : సీఎం కేసీఆర్ 

ముందస్తు ఎన్నికలకు వెళ్లము : సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండే. మేం ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు మేం చేయాల్సి ఉండే. కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లము : సీఎం కేసీఆర్ ఇప్పుడు అవసరం లేదు. పాలమూరు, సీతారామ పూర్తి కావాలి. తెలంగాణకు ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. బజారులో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడను. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు, ఏం చెప్పినామో అదే చేస్తామని ఆయన వెల్లడించారు. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సాట్లు, ఇప్పుడు 95-105 సీట్ల మధ్య గెలుస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 25 రోజుల తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తాను. దానిని చూస్తే మీరే ఆశ్చర్చపడతారు. నిన్ననే ఒక లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామని రిపోర్టులో వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు.