అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం

అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జీక్యూ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈ యేడాదికి గాను అల్లు అర్జున్ ను వరించింది. హైదరాబాద్ ఫలుక్ నామా ప్యాలెస్ లో జరిగిన వేడుకలో బన్ని ఈ అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా బన్ని షేర్ చేశారు. లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డుతో తనను సత్కరించినందుకు జీక్యూ ఇండియాకు బన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెల్పారు. నా లక్ష్యాల జాబితాలోని ఒకదాన్ని ఇలా నెరవేర్చుకున్నా అంటూ అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు.అల్లు అర్జున్ కు అరుదైన గౌరవంఫ్యాషన్, కల్చర్, పాలిటిక్స్ వంటి విభాగాల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వాళ్లకు ఈ అవార్డులు అందచేస్తుంటారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి అల్లు అర్జున్ కావడం విశేషం. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక నటిస్తోంది.