సారీ చెప్పిన మై విలేజ్ షో ఫేం గంగవ్వ

సారీ చెప్పిన మై విలేజ్ షో ఫేం గంగవ్వ

సారీ చెప్పిన మై విలేజ్ షో ఫేం గంగవ్వ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఎప్పుడూ వివాదాల్లోకి రాని గంగవ్వను ఓ టీవీ ఛానల్ ఇరికించింది. మై విలేజ్ షోతో ఫేమ్ అయిన గంగవ్వకు ఏ రోల్ ఇస్తే అదే చేయడం తెలుసు. అంతకుమించి స్వతహాగా రోల్ క్రియేట్ చేసుకుని స్క్రీన్ ముందుకు వచ్చే వ్యక్తి కాదు. మై విలేజ్ షో నిర్వహకులు ఇచ్చిన స్క్రిప్ట్ తో ఎంతో మంది స్టార్స్ ని సైతం తన అమాయకత్వపు మాటలతో ఇంటర్వ్యూలు చేస్తూ అందరినీ సరదాగా నవ్వించేది.అలాంటి గంగవ్వను ఎన్టీవీ ఛానల్ ఏకంగా పొలిటికల్ కాంట్రవర్సీలో ఇరికించేసింది.

అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గంగవ్వపై టీడీపీ శ్రేణులు, అభిమానులు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన గంగవ్వ అసలు విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియచేసింది. ఆ వీడియో అసలు జరిగిన విషయాన్ని తెలిపింది. చంద్రబాబునాయుడు జాతకం బాగాలేదని ఎన్టీవీ ప్రతినిధులు బలవంతంగా అనిపిస్తేనే తాను అన్నట్లు గంగవ్వ తెలిపింది. షూటింగ్ నిర్వహకులు ఇచ్చే స్క్రిప్ట్ ను చెప్పడం తప్ప, తనకు సొంతంగా పదాలు చెప్పడం రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రతీ ఒక్కరి ఆదరణ వల్లనే తాను ఈ స్థితిలో ఉండి, నాలుగు మెతుకులు తింటున్నానని కన్నీళ్ల పర్యంతమైంది. కావాలని చంద్రబాబుపై తాను విమర్శలు చేయలేదని, ఎన్టీవీ ఛానల్ ప్రతినిధులు అనిపిస్తేనే చెప్పానని,తప్పుగా అనుకోవద్దని,అందుకు క్షమాపణలు చెప్తున్నానని గంగవ్వ కన్నీళ్లపర్యంతం అవుతూ తను వీడియోను ముగించింది.