క్రైస్తవులకు క్రిస్మస్ విషెష్ : సీఎం కేసీఆర్ 

క్రైస్తవులకు క్రిస్మస్ విషెష్ : సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు.క్రైస్తవులకు క్రిస్మస్ విషెష్ : సీఎం కేసీఆర్ ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నప్పటికీ, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్పగుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.