​ కాల్​మనీ వ్యవహారాలను ఉపేక్షించొద్దు

కాల్​మనీ వ్యవహారాలను ఉపేక్షించొద్దు

వేధింపులపై కఠిన చర్యలు తీసుకోండి
అధికారులకు సీఎం జగన్​ ఆదేశం

వరంగల్ టైమ్స్, అమరావతి : ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎంవో కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలు వసూలు చేయడానికి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్న సమాచారం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.​ కాల్​మనీ వ్యవహారాలను ఉపేక్షించొద్దుకాల్‌మనీ వ్యవహారాలను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్యచేసుకున్న పదోతరగతి బాలిక సౌమ్య కుటుంబానికి రూ.10 లక్షలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణం దశరాజుపల్లెలో జరిగిన సజీవదహన ఘటనలో మరణించిన దివ్యాంగురాలు, వలంటీర్‌ భువనేశ్వరి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.