తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం హైదరాబాద్, ములుగు, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. 17న వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెల్పింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షపు జల్లులు కురుస్తాయని తెల్పింది. మార్చి 18న వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.