మీడియాను ఎవరూ అడ్డుకోలేరు

మీడియాను ఎవరూ అడ్డుకోలేరు

సుప్రీం కీలక వ్యాఖ్యలు

వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : ఉన్నత న్యాయస్థానాల్లో జరిగిన చర్యల నుంచి మీడియాను నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమీషన్ వేసిన పిటీషన్ పై విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య నాలుగు మూలస్థంభాల్లో మీడియా ఒకటని కోర్టుల్లో జరిగే విషయాలను ప్రజలతో మీడియా కమ్యూనికేట్ చేయగలదని జస్టిస్ వై.వి. చంద్రచూడ్, జస్టిసాలతో కూడిన బెంచ్ లో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.మీడియాను ఎవరూ అడ్డుకోలేరుకొద్దిరోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ “మీపై హత్యానేరం ఎందుకు మోపకూడదు?” అంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రంగా విరుచుకపడ్డ విషయం తెలిసిందే. ఐతే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పై సుప్రీం గడపను ఈసీ తొక్కింది.

అనంతరం సుప్రీం స్పందిస్తూ “కోర్టుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్టులకు సంబంధించిన అంశాలను ఇది రిపోర్టు చేయజాలదని అనలేం. మీడియా చాలా శక్తివంతమైంది. అందుకే ప్రతీ వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేసే సాధనం మీడియా అని, అందుకే దానిని నియంత్రించలేమని” సుప్రీం ధర్మాసనం పేర్కొంది…!!