ఆర్బీఐ కీలక నిర్ణయం  

ఆర్బీఐ కీలక నిర్ణయం

వరంగల్ టైమ్స్, ముంబై : ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నది. కీలక వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లకు పెంచింది. తక్షణమే కొత్త రెపో రేట్లు అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్యపరపతి కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మే 2 నుంచి 4 మధ్య జరిగిన మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని దాస్ పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, నిత్యవసరాల కొరత ఏర్పడటం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడినట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.ఆర్బీఐ కీలక నిర్ణయం  మే 2020 తర్వాత మొదటి సారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా గోధుమ సంక్షోభం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
rbi hikes repo rates by 40 basis points