కార్డు లేకుండానే నగదు విత్ డ్రా

కార్డు లేకుండానే నగదు విత్ డ్రా

వరంగల్ టైమ్స్ , ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది. కార్డు లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంలలో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కార్డ్ లెస్ విత్ డ్రాలను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తున్నాయని తెలిపారు. అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్ వర్క్స్ లో కార్డ్ లెస్ విత్ డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. 2022-2023 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటనను ఆయన ప్రకటించారు.కార్డు లేకుండానే నగదు విత్ డ్రాకార్డ్ లెస్ విత్ డ్రా ద్వారా వినియోగదారుడు తన వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకునే అకాశం ఉంటుంది. దీని ద్వారా కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీని ఆపేది లేదని ఆయన పేర్కొన్నారు. ఆ కార్డులను కేవలం క్యాష్ విత్ డ్రాల కోసమే కాదు అని, వాటిని రెస్టారెంట్లు, షాపులు, విదేశీ టూర్ల సమయంలో వాడుకునే వీలుందని చెప్పారు. ఆ కార్డులను ఎప్పటికీ కంటిన్యూ చేస్తామని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.