ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ : పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థిలోకి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికుడు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన నీలగిరి తోటకు చేరిన పోలీసులు బాధిత ప్రేమజంటను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంటను హైదరాబాద్ బోరబండ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు బాధితులను ఆరా తీస్తున్నట్లు సమాచారం.