సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ సర్కార్ తేనీటి విందు

సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ సర్కార్ తేనీటి విందుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకి ఇచ్చిన తేనీటి విందులో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్ లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు.

సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ సర్కార్ తేనీటి విందు

అంతకుముందు నోవాటెల్ హోటల్ లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ జిల్లాలో 3 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం జగన్ నేరుగా విజయవాడ చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న సీఎం జగన్ నోవాటెల్ హోటల్ లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు.