‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో పోస్టర్లు 

‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో పోస్టర్లు

'గో బ్యాక్ సీఎం సార్' అంటూ విశాఖలో పోస్టర్లు వరంగల్ టైమ్స్, విశాఖపట్టణం : విశాఖలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడటం కలకలం సృష్టించాయి. విశాఖ నుంచి త్వరలో పరిపాలన కొనసాగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలువడటం కలకలం రేపింది.’గో బ్యాక్ సీఎం సార్’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అంటూ విశాఖలో గురువారం ఉదయం పోస్టర్లు వెలిశాయి. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ప్రధాన కూడళ్లలో ‘జన జాగరణ సమితి’ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఉదయమే ఏర్పాటు చేశారు.

మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్ మెట్ట, జగదాంబ కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు వైఎస్సార్సీపీ నాయకులు పోస్టర్లను తొలగించారు. ఏయూ క్యాంపస్ ప్రశాంతతకు భంగం కల్గించేందుకు అవకాశమున్న ఈ పోస్టర్ల ఏర్పాటు వేనుక ఉన్నవారిని అరెస్ట్ చేయాలంటూ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు.