మేకపాటి గౌతంరెడ్డి శాఖలు ఎవరికీ ?

మేకపాటి గౌతంరెడ్డి శాఖలు ఎవరికీ ?

వరంగల్ టైమ్స్, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఇంతకాలం ఆయన బాధ్యతలు నిర్వర్తించిన శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత, జౌళీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్ నిర్వర్తించేవారు. ఇప్పుడు ఆ శాఖల బదలాయింపు విషయంలో రెండు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ శాఖలను వేరే మంత్రులకు బదలాయించడం లేదా కొద్దికాలం వాటిని సీఎం వద్దే ఉంచి త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో ఇతర మంత్రులకు సర్దుబాటు చేయడమనేదే ఈ ప్రతిపాదనల సారాంశమని అంటున్నారు.

మేకపాటి గౌతంరెడ్డి శాఖలు ఎవరికీ ?

ఇప్పుడే బదలాయిస్తే 5 శాఖలు ఒకరికే లేదా వేర్వేరు మంత్రులకు కేటాయిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ లకు గౌతమ్ చేసిన శాఖలను పంచే అవకాశం ఉందన్న చర్చ వేసీపీ వర్గాల్లో జరుగుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్నందున అంతకంటే ముందుగానే ఈ శాఖల బాధ్యులను ఖరారు చేయనున్నారని అంటున్నారు.