మేయర్​ చాన్స్​ ఎవరికో..?

టీఆర్​ఎస్ నుంచి 31 మంది మహిళల విజయం
కర్చీకోసం ఎవరి ప్రయత్నాల్లో వారుమేయర్​ చాన్స్​ ఎవరికో..?హైదరాబాద్: గ్రేటర్​ ఎన్నికలు పూర్తవడంతో ఇక అందరి దృష్టి మేయర్​ కుర్చీ పై పడింది. ఫలితాల్లో టీఆర్​ఎస్​ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గులాబీ దళం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్​ఎస్​ నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. పైగా అందరు ఉన్నత విద్యాభ్యాసం చదువుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యం కలిగిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. పలువురు కార్పొరేటర్ల పేర్లు మేయర్​ పదవి రేసులో ప్రముఖంగా వినబడుతున్నాయి. అయితే ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉండడంతో మేయర్​ స్థానాన్ని ఆశిస్తున్నవారు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్​ఎస్​ 56 సీట్లు గెలుచుకోగా 30 మంది ఎక్స్​ఆఫీషియోల బలం కూడా ఉంది. వీటితో కలుపుకుని 86 మంది సభ్యుల బలం టీఆర్ఎస్ కు ఉంది. ఇక మజ్లీస్​కు 54, బీజేపీకి సుమారు 50 మంది సంఖ్య బలం ఉంది. మూడు పార్టీలు మేయర్​ పీఠానికి తమ అభ్యర్థులను నిలిపితే టీఆర్​ఎస్​ ఎవరి మద్దతు లేకుండానే పీఠాన్ని సునాయసంగా కుర్చీని దక్కించుకునే వీలుంది. లేని పక్షంలో మజ్లిస్​, బీజేపీలో ఏ పార్టీ గైర్హాజరైనా టీఆర్​ఎస్​కు​ లబ్ధి చేకూరుతుంది. అయితే మేయర్​ పీఠం జనరల్​ మహిళకు రిజర్వ్​ కావడంతో టీఆర్​ఎస్​ నుంచి 31 మంది మహిళలు విజయం సాధించారు. గెలిచిన వారిలో కొందరు రెండోసారి విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. దీంతో మేయర్ ను​ ఎంపిక చేయడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశముంది. ఇది ఇలాఉండగా గెలిచిన వారు ఎవరికివారు తమ సానుకూలతలను అధిష్టానం ముందు పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో.